పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో పవన్ ను మాస్ అవతార్ లో చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఊగి పోతున్నారు.
చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ రేంజ్ కు తగిన సినిమా పడడంతో ఆ రేంజ్ లో హిట్ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కు చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద హిట్ దక్కడంతో ఆయన మరింత ఆనందంగా ఉన్నాడు.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమా ఆద్యంతం అలరిస్తుంది.
ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా.రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది.అయితే ఈ సినిమాలో నటించిన సంయుక్త మీనన్ గురించి గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఈమెకు తక్కువ స్పేస్ ఇచ్చిన కూడా ఆమె పాత్రకు న్యాయం చేసి ప్రేక్షకుల చేత మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ సినిమా స్క్రీన్ స్పేస్ విషయంలో ఈమె హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి.
దీనిపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది.తాను హర్ట్ అయ్యిన మాట నిజం అని చెప్పి ఒక పోస్ట్ సెటైరికల్ గా పోస్ట్ చేసింది.”అభిమానులందరితో కలిసి ఈ సినిమాను రెండవసారి చూడలేక పోయానని.టికెట్స్ దొరకలేదని.
అందుకే భీమ్లా నాయక్ తో నేను హర్ట్ అయ్యానని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈమె ప్రెసెంట్ ధనుష్ సార్ సినిమాలో నటిస్తుంది.