చదివింది టెన్త్ మాత్రమే కానీ రూ.4.50 కోట్లు లాగేసాడు.. ఎలాగంటే.. ?

నేడు సమాజంలో నిజాయితీగా డబ్బులు సంపాదించే వారే కరువైయ్యారు.జల్సాలు ఎక్కువై పోయాయి, ఇందుకు సరిపడ సంపాదన కరువైంది.

 Rs 4 50 Crore White Collor Fruad In Hyderabad, Hyderabad, Rs 4.50 Crore, White C-TeluguStop.com

మరి యువత ఎలా సంపాదించుకుని ఎంజాయ్ చేస్తారంటే వీరు అడ్దదారులను ఎంచుకుంటున్నారు.

ఇక మోసం చేయాలంటే పెద్ద పెద్ద చదువులు అక్కరలేదు, చీట్ చేసేటన్ని తెలివితేటలుంటే చాలు.

ఇదిగో ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్న ఓ వ్యక్తి తాను చదివింది పదో తరగతే అయినా ఎవడికి లేనన్ని తెలివి తేటలతో సంపన్నులను సైతం మోసం చేశాడు.ఆ వివరాలు చూస్తే.

వరంగల్ జిల్లా న్యూరాయ్ పూర్ కు చెందిన మీర్జా ఖాదర్ అలియాస్ సమర్ మీర్జాకు పెద్దగా చదువు అబ్బలేదు.ఈ క్రమంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి, మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్ స్ట్రక్షన్స్ పేరిట ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు.30 మందిని ఉద్యోగులతో గచ్చిబౌలిలోని పీఎస్ఆర్ ప్రైమ్ టవర్స్ భవంతిలో ఓ ఫ్లోర్ అద్దెకు తీసుకుని, సదరు సంస్థకు తాను డైరెక్టర్ గా ప్రకటించుకున్నాడు.

తర్వాత ఆన్ లైన్ లో వ్యాపార, నిర్మాణల కోసం, వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు.

ఇలా రుణాల కోసం పలువురు అతన్ని ఆశ్రయించగా, వారి నుంచి కోట్లు దండుకున్నాడు.ఇలా 18 మంది నుండి సుమారుగా రూ.4.50 కోట్ల మేరకు వసూలు చేసినట్లుగా తెలిసింది.కాగా ప్రస్తుతం ఇతని మోసాలు వెలుగులోకి రాగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube