రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.రెండు బ్యాంకుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఝలక్ ఇచ్చింది.
ఆ కారణం చేత ఆయా బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకొని తీరాలి.లేదంటే తర్వాత ఇబ్బంది చాలా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
ఆ రెండు కూడా కోఆపరేటివ్ బ్యాంకులని( Co-operative Banks ) విశ్వసనీయ వర్గాల సమాచారం.కారణం ఒకటే… ఆయా బ్యాంకుల పనితీరు బాగా పేలవలంగా ఉండటంతో ఆర్బీఐ( RBI ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు.
![Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/rbi-imposes-restrictions-on-these-two-co-operative-banks-detailsas.jpg)
ఇక ఆ రెండు బ్యాంకులు ఏవంటే… వరుసగా అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్( Ajanta Urban Cooperative Bank ) మరియు పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంకులు.( Purvanchal Cooperative Bank ) ఈ రెండు బ్యాంకులపై ఆర్బీఐ కఠిన ఆంక్షలు తీసుకు వచ్చింది.ఆగస్ట్ 29 నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయని కూడా ఆర్బీఐ ఆల్రెడీ ఓ ప్రకటన వెలువరించింది.ఈ ఆంక్షలు వచ్చే 6 నెలల కాలం వరకు అమలులోనే ఉంటాయని కూడా చాలా నిక్కచ్చిగా తెలిపింది.
ఇకపోతే ఈ ఆంక్షల నేపథ్యంలో బ్యాంకులు వాటి పనులు అవి పూర్తి స్వేచ్ఛాతో చేసుకునే అవకాశం ఉండదు.ముఖ్యమైన పనులకు కచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకువాల్సిందే.
ఏటీఎం చార్జీలు మాఫీ, కొత్త అకౌంట్ సేవలు! బ్యాంకులు కస్టమర్లకు సంబంధించిన ఏ రుణాలను కానీ, అడ్వాన్స్లను కానీ రెన్యూవల్ చేయకూడదు.
![Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/rbi-imposes-restrictions-on-these-two-co-operative-banks-detailsd.jpg)
అదే విధంగా కొత్తగా రుణాలు జారీ చేయకూడదు.ఇంకా చెప్పాలంటే కస్టమర్ల నుంచి డిపాజిట్లు ( Deposits ) కూడా స్వీకరించడానికి వీలులేదు.అలాగే కస్టమర్లకు ఎలాంటి పేమెంట్లు చేయకూడదు.
అంతేకాకుండా బ్యాంకులు వాటి ప్రాపర్టీలను విక్రయిండచం లేదా ట్రాన్స్ఫర్ చేయడం వంటివి అయితే అస్సలు చేయకూడదు.ఒకవేళ, ఇలాంటి ఏ పనులు చేయాలన్నా కూడా బ్యాంకులు.
ఆర్బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఈ రెండు బ్యాంకులు కూడా ఆర్బీఐ ఆదేశాలను తమ తమ వెబ్సైట్లలో, బ్యాంక్ బ్రాంచుల్లో ప్రజలకు కనిపించేలా ఉంచాలని ఆర్బీఐ పేర్కొంటోంది.