బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంపై వర్షం ప్రభావం పడింది.ఈ మేరకు రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగాల్సిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ రద్దు అయింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇప్పటివరకు హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించలేదు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది.అయితే తెలంగాణకు రేపు కూడా వర్ష సూచన ఉండటంతో పాటు నగరంలో వర్షం పడుతున్న నేపథ్యంలో రేపు జరగాల్సిన ప్రజా ఆశీర్వాద సభను రద్దు చేస్తూ బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.