Prime Minister Modi : దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు శుభవార్త తెలియజేసిన ప్రధాని మోదీ..!!

దేశ ప్రధాని మోదీ ( modi )దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలియజేశారు.ట్రక్కు మరియు ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంట ప్రభుత్వం విశ్రాంతి భవనాలు నిర్మిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

 Pm Modi Gave Good News To The Drivers Across The Country-TeluguStop.com

ట్రక్కు, టాక్సీ డ్రైవర్లు.దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని అన్నారు.

వారు గంట గంటలు డ్రైవింగ్ చేస్తుంటారు.విశ్రాంతి తీసుకోవడానికి సమయం కూడా ఉండదు.

దీంతో రోడ్డు ప్రమాదాలు ఎదురవుతుంటాయి.ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టే విధంగా వారు విశ్రాంతి పొందేలా సకల సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

కేంద్రంలో ఎన్డీఏ 3 హయాంలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఢిల్లీలో( Delhi ) శుక్రవారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోను ఉద్దేశించి ప్రసంగించారు.తాము దేశంలో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.ఎన్డీఏ హయాంలో గత ఐదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని లెక్కలు బయటపెట్టారు.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని వ్యాఖ్యానించారు.మొబిలిటీ రంగానికి ఇది స్వర్ణ యుగమని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube