జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో పవన్ నటిస్తుండగా ఈ సినిమా కాకుండా పవన్ మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అలా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ ఒకటి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో పవన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తారనే చర్చ జరుగుతోంది.మొదటి నుంచి ఈ పాత్రకు రానా పేరు వినిపించినా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాలో రానాకు బదులుగా నితిన్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే రానా ఈ సినిమాలో నటించకపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పవన్ ను అభిమానించే హీరోల్లో నితిన్ ఒకరు.పలు సందర్భాల్లో పవన్ పై తనకు ఉన్న అభిమానం గురించి నితిన్ చెప్పుకొచ్చారు.పవన్ సినిమాలో ఛాన్స్ అంటే నితిన్ నో చెప్పే ప్రసక్తే లేదు.
అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈరోజు ఉదయం నుంచి పవన్ సినిమాలో నితిన్ నటించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతోంది.
రానా ఈ సినిమా గురించి స్పందించని నేపథ్యంలో ఈ వార్త నిజమే కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
అయ్యప్పన్ కోషియమ్ సినిమాను సాగర్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేయడంతో పవన్ సాగర్ కు ఛాన్స్ ఇచ్చారని సమాచారం.