ఇంగ్లాండ్,పాక్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు జరిగిన 4 వన్డేల్లో పాక్ ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.
అయితే నామమాత్రం గా జరిగే ఐదో వన్డేలో కూడా పాక్ ఏమాత్రం ఆడుతుందో తెలియదు కానీ ఈ ఒక్క మ్యాచ్ లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పాక్ భావిస్తుంది.
అయితే మరోపక్క పాక్ ప్రపంచ కప్ జట్టులోకి ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ను తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు జరిగిన 4 వన్డేల్లో పాక్ ఓడిపోవడం తో పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ జట్టు కూర్పులో కొన్ని కొన్ని మార్పులు చేశారు.
ఈ క్రమంలో అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ ఆమిర్, వాహబ్ రియాజ్లకు వరల్డ్కప్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
వాస్తవానికి ఇప్పటికే 15 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేసిన పాక్ ఇప్పడు తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ కారణంగా జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి.వరల్డ్కప్ కోసం ప్లేయర్ల జాబితాను మార్చుకోవడానికి మే 23వ తేదీ వరకు క్రికెట్ జట్లకు అవకాశం ఉన్న కారణంగా పాక్ తన జట్టులో మార్పులు చేసినట్లు తెలుస్తుంది.