నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.నాని చివరి రెండు సినిమాలైన వి, టక్ జగదీష్ రెండు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి.
అందుకే శ్యాం సింగ రాయ్ సినిమాకు నాని ఫ్యాన్స్ హంగామా స్పెషల్ గా అనిపిస్తుంది.ఇక నాని కోసం దేవి 70 ఎం.ఎం థియేటర్ లో 63 అడుగుల కటౌట్ ఒకటి ఏర్పాటు చేశారట.సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ స్థాయికి వచ్చాడు నాని.
నాని గత రెండు సినిమాలు ఓటీటీలో రిలీజై నిరాశపరచాయి.అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా అన్ని డేట్స్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. శ్యాం సింగ రాయ్ తో ఈ క్రిస్మస్ మనదే అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు నాని.శ్యాం సింగ రాయ్ సినిమా తెలుగుతో పాటుగా కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది.సినిమా తప్పకుండా ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెబుతున్నారు.సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.