సుడిగాలి సుధీర్ పరువు తీసిన ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే?

బుల్లితెర పై అతి తక్కువ సమయంలో ఒక స్టార్ హీరో కు ఉన్న క్రేజును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో బుల్లితెర కింగ్ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Nandamuri Taraka Ratna Comments On Sudheer In Sridevi Drama Company Show Details-TeluguStop.com

కమెడియన్ గానే కాకుండా నటుడుగా, యాంకర్ గా, మెజీషియన్ గా కూడా ఒక గుర్తింపు పొందాడు.

కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ చేస్తూ తన జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఈటీవీ జబర్దస్త్ లో అవకాశం వచ్చింది.

దీంతో ఈ జబర్దస్త్ షో వల్ల సుడిగాలి సుధీర్ దశ మొత్తం తిరిగిపోయిందని చెప్పవచ్చు.మొదట ఇందులో ఒక టీమ్ లో చిన్న కమెడియన్ గా నటించాడు సుధీర్.

ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొంది టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.మొత్తానికి జబర్దస్త్ ద్వారానే వెండితెరపై అవకాశాలు అందుకున్నాడు.

హీరోగా కూడా నటించాడు.బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు సుధీర్.

ఇక జబర్దస్త్ తో పాటు పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా టీమ్ లీడర్ గా, యాంకర్ గా చేశాడు.జబర్దస్త్ ఎంట్రీ తర్వాత పోవే పోరా అనే షో ద్వారా యాంకర్ గా పరిచయమయ్యాడు.

ఇక ఆ తర్వాత డీ డాన్స్ షో లో టీం లీడర్ గా చేశాడు.అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే.

మొత్తానికి సుడిగాలి సుధీర్ రేంజ్ అనేది అలా పెరిగిపోయింది.ఇక ఈయన ఎక్కువగా అమ్మాయిల విషయాలలోనే బాగా హాట్ టాపిక్ గా నిలుస్తాడు.ఏ అమ్మాయి అయినా సుధీర్ స్టైల్ కి పడిపోవాల్సిందే.ఈయన మరో యాంకర్ రష్మీ తో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

అలా సుధీర్ ప్రతి ఒక్కరికి బాగా పరిచయం అయ్యాడు.ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ పరువు తీశాడు ఎన్టీఆర్.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.ప్రస్తుతం సుధీర్ బుల్లి తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.కారణం వెండి తెరపై బాగా బిజీ గా మారాడు.దీంతో ఆయన యాంకరింగ్ కూడా చేయట్లేదని అర్థమవుతుంది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో విడుదలైంది.స్పెషల్ గెస్ట్ గా నందమూరి తారకరత్న ఎంట్రీ ఇచ్చాడు.ముందు సుడిగాలి సుధీర్ ను.‘కొంచెం యాంకరింగ్ చేయండి సుధీర్ గారు’ అని అనడంతో తాను ఎంటర్టైనర్ అని యాంకరింగ్ కాదని అన్నాడు.

కానీ వెల్కం చెబుతాను అంటూ సుధీర్ డైలాగ్ చెబుతుండగానే.బాగుంది బాగుంది చాలా బాగుందంటూ సుధీర్ పరువు తీసేసాడు తారకరత్న. దీంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఇది చూసిన సుధీర్ అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube