నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు.రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఎంఈకి ఆదేశించారు.అయితే, రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం వీల్ చైర్ తీసుకుని వచ్చే లోపులోనే రోగిన వారి బంధువులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని తెలిపింది.