సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘జనగణమణ’.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాను కూడా విజయ్ తోనే చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు.
అయితే ఇప్పుడు అంతా మారిపోయింది.ఒక్క సినిమా ప్లాప్ వీరి ప్లాన్స్ అన్ని తలక్రిందులు చేసేశాయి.
ఇటీవలే వీరి కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ప్లాప్ అయ్యింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పూరీకి నష్టాలను మిగిల్చింది.దీంతో వీరి కాంబోలో రాబోతున్న జనగణమణ సినిమా వాయిదా వేశారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా లైగర్ రిలీజ్ కంటే ముందే పూరీ షూట్ కూడా స్టార్ట్ చేసి ముంబై లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు.ఆర్మ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే ఇప్పుడు లైగర్ ఇచ్చిన షాక్ తో ఈ సినిమా ముందుకు వెళ్లడం కష్టం అంటున్నారు.ఈ నేపథ్యంలో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది.అయితే ఈ సినిమాకు పూజా హెగ్డే చాలా డేట్స్ కేటాయించింది.మరి ఈ అమ్మడి డేట్స్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మిగిలి పోయింది.
ఈ సినిమాను ఆగకుండా షూట్ చేయాలని పూరీ పూజా హెగ్డే డేట్స్ తీసుకున్నాడట.అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు జేజిఎమ్ కోసమే ఈ అమ్మడు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోతుంది అని ఎవరు అనుకోలేదు.దీంతో పూజా డేట్స్ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారిపోయింది.ఈమె ఈ సినిమా కారణంగా మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ షెడ్యూల్ లో ఎంటర్ అవ్వబోతుంది.కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడంతో ఈమె ఇప్పుడే మహేష్ సినిమాలో పాల్గొంటుందా? లేదా చూడాలి.ఇక ఈ డేట్స్ విషయంపై పూరీ పూజా హెగ్డే ను ఎలా మ్యానేజ్ చేస్తాడో అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది.