గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కడానికి సిద్ధమైన కీసర తహసీల్దారు! 

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం లేపిన కీసర తహసీల్దారు బాలరాజు నాగరాజు ఒక భూమికి పట్టా ఇవ్వడం కోసం 2 కోట్ల రూపాయిలు లంచంగా తీసుకోవడానికి అంగీకరించారు.అందులో భాగంగా 1.10 కోట్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టుబడ్డారు.బాలరాజు నాగరాజు దగ్గర కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్ దొరికింది.

 Anti Corruption Group Ask Guinness Book Name For Keesara Mro, Keesara Mro, Guinn-TeluguStop.com

దీనికి తనకు ఎటువంటి సంబంధం లేదని ఒకవేళ అతనికి నాకు సంబంధం ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా మరోమారు బాలరాజు నాగరాజు వార్తలలో నిలిచారు దానికి కారణమేంటంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారని కావున ఈ అంశాన్ని గిన్నిస్ రికార్డులలోకి ఎక్కించవల్సిందిగా ఆ రెండుస్వచ్చంద సంస్థల ప్రతినిధులు గిన్నిస్ రికార్డు అధికారులను కోరారు.

తాజాగా దీని పై స్పందించిన గిన్నిస్ రికార్డు అధికారులు ఇప్పటివరకు తమ రికార్డ్స్ లో ఇలాంటి కేటగిరి లేదని దీనికోసం ఆ కేటగిరీని ప్రారంభించే విషయంపై తమ టీంతో కలిసి పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube