తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలయ్య బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఓటిటి షోలు, యాడ్స్ లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు.ఈ జోష్ లోనే తాజాగా మొదలైన ఐపీఎల్ 2023 కామెంటేటర్( IPL 2023 commentator ) కాబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇదే విషయంపై స్టార్ స్పోర్ట్స్ ఈ కార్యక్రమంలో ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఐపీఎల్ లాంచింగ్ ఈవెంట్ కి ముందు బాలయ్య తెలుగు కామెంటేటర్స్ తో కలిశారు.తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పంచారు.ఐపీఎల్ ఈవెంట్లో బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జై బాలయ్య సాంగ్ తో ఆయనకు తెలుగు కామెంటేటర్స్ భారీగా ఘన స్వాగతం పలికారు.హీరో నందుతో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ లతో కలిసి ముచ్చటించారు బాలయ్య బాబు.
క్రికెటర్ గా తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.స్కూల్ డేస్ లో నేను క్రికెట్ ఆడేవాడిని.
కాలేజ్ డేస్ లో అజారుద్దీన్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి మేటి క్రికెటర్స్ తో అనుబంధం ఉంది అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బాలయ్య బాబు.
ఈ ఐపీఎల్ లో తన మద్దతు తెలుగు టీమ్ సన్ రైజర్స్ కే అని చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.ఐపీఎల్ కప్ తెలుగు వారు గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఐపీల్ కామెంటేటర్ బాలయ్య బాబు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతో స్టేజి మొత్తం దద్దరిల్లిపోయింది.
జై బాలయ్య అనే నినాదాలతో మారుమోరిపోయింది.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో స్టార్ హీరోయిన్స్ మిల్క్ బ్యూటీ తమన్నా, ఎనిమీ చిత్రంలోని మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ టమ్ టమ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం డాన్స్ ని ఇరగదీసింది.