అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా, వరిస్తుందో తెలియదు ఊహలకు అందనంతగా, కళ్ళు చెదిరిపోయేలా, ఒక్కో సారి నోట మాట కొన్ని నిమిషాల పాటు ఆగిపోయేలా అదృష్టం వరిస్తుంది.దురదృష్టం కూడా అచ్చం ఇలానే ఉంటుంది కానీ ఇందులో కన్నీళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఈ సూక్తులు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.యూఏఈ లో భారత సంతతి వ్యక్తికి ఎదురైనా రెండు అదృష్టాల అనుభవం అలాంటిది మరి.వివరాలలోకి వెళ్తే.
యూఏఈ లో భారతీయులకు లాటరీలలో అదృష్టం వరించడం పరిపాటే, నిర్వాహకులు లాటరీలు తీసే ప్రతీ సరి ఎక్కడో ఒక చోట భారతీయుడి పేరు వినిపించకుండా ఉండదు.
అక్కడి లాటరీలను అత్యధికంగా భారతీయ వలస వాసులే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.అయితే ఒక సారి లాటరీ తగలడం పెద్ద విషయమే, ఎందుకంటే వేలాది మంది లక్షల టిక్కెట్లు కొనుగోలు చేస్తారు అందులోంచి ఒక వ్యక్తి పేరు రావడం అంటే అతడికి ఏ రేంజ్ లో సుడి ఉండాలో అర్థం చేసుకోవచు, కానీ అదే వ్యక్తికి రెండో సారి లాటరీ తగిలితే మరి అతడిని ఏమనాలి.
అలా రెండో సారి అదృష్టాన్ని ఆస్వాదిస్తున్నాడు యూఏఈ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తి సైదలీ కన్నన్.
సైదలీ కన్నన్ కేరళకు చెందిన ఆయన అబుదాబి లో గడిచిన కొన్నేళ్లుగా షెఫ్ గా పనిచేస్తున్నారు.
ఆయనకు లాటరీలు అంటే ఆసక్తి ఉండటంతో 1998 లో లాటరీ కొనుగోలు చేయగా పెద్ద మొత్తంలోనే డబ్బు గెలుచుకున్నారు.ఆ తరువాత అంటే సుమారు 24 ఏళ్ళ తరువాత కన్నన్ ను మళ్ళీ అదృష్టం వరించింది.
ఈ మధ్య కాలంలో జరిగిన అబుదాబి బిగ్ టిక్కెట్ లాటరీలో కన్నన్ రూ.కోటి గెలుచుకున్నాడు.అయితే ఈ సారి తన స్నేహితుడితో కలిసి టిక్కెట్టు కొనుగోలు చేశానని, వచ్చిన మొత్తంలో చెరిసగం పంచుకుంటామని తెలిపాడు.మళ్ళీ లాటరీలో గెలుస్తానని అనుకోలేదని కానీ అదృష్టం తనని వరించిందని ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు.