ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే ఉద్యోగులు సొంత కంపెనీలోనే చోరికి యత్నించారు.ఏకంగా రూ.1.23కోట్లను కొట్టేశారు.ఆడిటింగ్ లో తేడా రావడంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ మొదలు పెట్టారు.
ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.సికింద్రాబాద్ లోని సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తోంది.
డిపాజిట్ చేయడంలో భాగంగా బీటీఐ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కూడా ఒప్పదం కుదర్చుకుంది.నగరంలోని 36 ఏటీఎం సెంటర్లో బీటీఐ సంస్థ క్యాష్ డిపాజిట్ చేస్తుంటుంది.
బీటీఐ సంస్థలో పనిచేసే రమాభారత్, సాయితేజ, రాజశేఖర్ రెడ్డి, అశ్విన్ కస్టోడియన్లుగా నియమించబడ్డారు.వీరికి ఏటీఎంల తాళాలు, పాస్ వర్డులు అందించి డబ్బును డిపాజిట్ చేస్తుండాలి.అయితే ఈ నలుగురు పరిధిలో ఉన్న ఏటీఎం సెంటర్లలో రిపోర్టులు రాకపోవడంతో అసలు విషయం బయటపడింది.అనుమానంతో నిర్వాహకులు ఆడిటింగ్ నిర్వహించగా తీసుకున్న నగదుకు, ఏటీఎంలో డిపాజిట్ చేస్తున్న డబ్బుకు తేడా కోట్లలో కనిపించింది.
దీంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో కొనసాగించారు.