న్యూ ఇయర్ టార్గెట్ చేసుకుని ఎంతో మంది ఏడాదంతా సరిపడేంత సంపాదన పోగు చేసుకుంటారు.డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటారు.
సినీ స్టార్స్, మోడల్స్ ను ఆయా ఈవెంట్లకు తీసుకొచ్చి బాగా క్యాష్ చేసుకుంటారు నిర్వాహకులు.అలాగే సినీ స్టార్స్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేదికగా బాగానే డబ్బు సంపాదిస్తారు.
ఈ పార్టీల్లో ఆడిపాడినందుకు బాగానే డబ్బులు తీసుకుంటారు.కొందరు హీరోయిన్లు ఈ పార్టీల్లో పాల్గొనేందుకు భారీగానే పారితోషికం అందుకుంటారు.
ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గాను.భారీగానే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇంతకీ ఏ స్టార్.ఎంత తీసుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఒక్క రాత్రికి గాను ఓ టాప్ హీరోయిన్ ఓ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అందుకున్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ 31 నైట్ బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో సన్నీ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఇక ఆమెకు భారీగా డబ్బు ముట్టజెప్పారు.ఆమె పేరు చెప్పి.
టిక్కెట్లు కూడా బాగానే అమ్మారు నిర్వాహకులు.ఈ ఒక్కరాత్రికి గాను సన్నీ రూ.3 కోట్లు తీసుకుందట.
అటు టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా కూడా న్యూ ఇయర్ ఈవెంట్ లో పాల్గొందట.విజయవాడ – గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్లో తన లేలేత అందాలతో మంచి ప్రదర్శన ఇచ్చిందట.ఈ ప్రదర్శనలో పాల్గొన్నందుకు గాను తను నిర్వాహకుల నుంచి రూ.కోటి తీసుకుందట.ఇదే ఈవెంట్ లో తమన్నాతో పాటు పైసా వసూల్ భామ కైరా దత్ కూడా సందడి చేశారట.
వీరికి ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇచ్చారట నిర్వాహకులు.అటు పూనమ్ పాండే సైతం ఓ ఈవెంట్ లో పాల్గొని రూ.30 లక్షలు తీసుకుందట.అటు ముదురు భామ శ్రియ శరణ్ కూడా న్యూఇయర్ ఈవెంట్ లో పాల్గొని అందాలను ఆరబోసిందట.ఇందుకు గాను తను కూడా రూ.30 లక్షలు తీసుకుందట.