మహిళా దినోత్సవాన్ని( Womens Day ) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) కీలక నిర్ణయం తీసుకున్నారు.సామాన్యులకు శుభవార్తను అందిస్తూ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్( Domestic Gas Cylinder ) ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గించినట్లు మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రధానంగా నారీ శక్తికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందని తెలిపారు.అయితే ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.955 ఉండగా.కేంద్రం నిర్ణయంతో రూ.855 కు చేరనుంది.అలాగే ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.903 ఉండగా ప్రస్తుతం రూ.803 కు చేరనుంది.