సాధారణంగా సీజనల్ గా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి చాలామంది సతమతమవుతూ ఉంటారు.అయితే వర్షాకాలంలో వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు చాలా ఉపయోగపడతాయి.
ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కూడా మీ సొంతం అవుతుంది.ఎంతో కాలం నుంచి మన భారతీయులు ఆయుర్వేదాన్ని విశ్వసిస్తూ వస్తున్నారు.
ఆయుర్వేదం ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు.అయితే ఇంగ్లీష్ మందులు నయం చేయలేని ఎన్నో సమస్యలని, ఆయుర్వేదం నయం చేస్తుందని పలువురు అభిప్రాయపడతారు.
అయితే సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను దూరం చేసే మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడే మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వరోగ నివారణిగా తులసి( Tulasi )ని పరిగణిస్తారు.దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి.
వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తులసి ఆకులు తినడం వలన నయం చేసుకోవచ్చు.తులసి ఆకులను నేరుగా తీసుకోవడం, టీ చేసుకుని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరిగి శ్వాసకోశ సమస్యల( Respiratory problems ).దీనిని దాదాపు 75% ఆయుర్వేదంలో వాడుతారు.అయితే వేపలో యాంటీ మెట్రోబయల్, శిలీంద్ర సంహారిణి లక్షణాలు ఉంటాయి.

దీనిని తీసుకోవడం వలన రక్త శుద్ధి జరగడమే కాకుండా బాడీ నుండి టాక్సిన్స్ కూడా బయటికి వెళ్లిపోతాయి.ఇక మొటిమలు తామర, చర్మ సమస్యలకి మంచి ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు. మంజిష్ట( Manjistha ) తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది.అంతేకాకుండా కాలేయం, మూత్రపిండాలు, చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ మూలిక ఎంతో సహాయపడుతుంది.ఇక మొటిమలు, ఎలర్జీల నుండి ఉపశమాన్ని కూడా కలిగిస్తుంది.అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.
ఇక త్రిఫల అనేది మూడు మూలికల కలయిక.వీటిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీని పెంచడంతోపాటు జీర్ణక్రియని కూడా మెరుగ్గా చేయడంలో బాగా పనిచేస్తుంది.
గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.