తమ ముఖ చర్మం ( Facial skin )తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకోని వారు ఉండరు.ఈ నేపథ్యంలోనే ఖరీదైన క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా మాత్రం మ్యాజిక్ చేస్తుంది.
మీ ముఖంతో పాటు మెడను కూడా తెల్లగా మృదువుగా మెరిపిస్తుంది.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు బాగా పండిన బొప్పాయి పండు( Papaya fruit ) ముక్కలు వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు ప్యూరీ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్,( Rose petals powder ) వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.కావాలంటే కొద్దిగా రోజ్ వాటర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉంటాయి.
చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.అలాగే మిల్క్ పౌడర్ లో ఉండే పలు సుగుణాలు స్కిన్ ను మృదువుగా కోమలంగా మారుస్తాయి.
చర్మం టైట్ గా వైట్ గా మారేందుకు బొప్పాయి గ్రేట్ గా ( Papaya fruit )సహాయపడుతుంది.కాబట్టి మీ ముఖం, మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోతూ కనిపించాలి అంటే తప్పకుండా ఈ చిన్న చిట్కాను పాటించండి.