టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మహేష్ మరోసారి తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.
గీతా గోవిందం వంటి బ్లాక్బస్టర్ అందించిన పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కిస్తూ తమ ఫాలోయింగ్ను పెంచుకుంటున్నారు.అయితే మహేష్ మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీని తెరకెక్కించలేదు.
దీంతో తమ అభిమాన హీరో ఎప్పుడు పాన్ ఇండియా మూవీ తీస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.అయితే సర్కారు వారి పాట పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడంతో మహేష్ తన నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని చూస్తున్నాడట.
దర్శకధీరుడు రాజమౌళితో తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు మహేష్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్గా నిలిచిన జక్కన్న అయితే తనకు పాన్ ఇండియా మూవీతో అదిరిపోయే క్రేజ్ను తీసుకురాగలడని మహేష్ భావిస్తున్నాడట.
అయితే మహేష్ కోసం జక్కన్న మరోసారి పాన్ ఇండియా కథను తీసుకుంటాడ లేక తెలుగులోనే సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేస్తాడా అనేది చూడాల్సి ఉంది.మరి మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.