ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ చైనా దేశంలోని వ్యూహన్ నగరంలో పుట్టిందని ఇప్పటికే పలువురు వైద్యులు గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ
కరోనా వైరస్
ప్రస్తుతం ఇతర దేశాల్లో బాగానే కలకలం సృష్టిస్తోంది.
అయితే ఇతర దేశాల్లో ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా లాక్ డౌన్ ని విధించినప్పటికీ
చైనా
లో మాత్రం ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రభావం అంతగా కనిపించడం లేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ కరోనా వైరస్ వల్ల దాదాపుగా
చైనా
దేశంలో 40 వేలకు మందికి పైగా మరణించినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం అం కేవలం 3 వేల మంది మాత్రమే మరణించారని అధికారికంగా చెబుతోంది.
అయితే ఈ కరోనా వైరస్ లెక్కలని ఇతర దేశాలు తప్పుబడుతున్నాయి.అంతేకాక ఈ కరోనా వైరస్ మొదటిగా కలకలం సృష్టించినటువంటి వ్యూహాన్ నగరంలోనే కేవలం 2500 మందికి పైగా మరణించారని అలాంటి దేశం మొత్తం పైకి 500 మంది మాత్రమే మృత్యువాత పడ్డారని ఎలా ధృవీకరిస్తారంటో ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వార్తలపై చైనా ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.
ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ వల్ల భయంతో వణికిపోతున్నాయి.
కానీ
భారత దేశం
మాత్రం ఈ కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఇందులోభాగంగా ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ
లాక్ డౌన్
ని విజయవంతంగా అమలు చేస్తోంది.
అంతేగాక ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు దేశంలోని పలువురు సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు.దీంతో మరికొద్ది రోజుల్లోనే
భారతదేశం
ఈ కరోనా వైరస్ ని దేశం నుండి తరిమి కొడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.