కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనపై దాడులు చేయిస్తున్నారని అన్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపణలు చేశారని సమాచారం.కాంగ్రెస్ కార్యకర్తలు తనపై ఇప్పటికే రెండు సార్లు దాడికి పాల్పడ్డారని తెలిపారు.
ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందన్న రవిశంకర్ రక్షణ కల్పించాలని కోరారు.