కాంగ్రెస్ తోనే తెలంగాణలో మార్పు సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.వచ్చే ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్న భట్టి విక్రమార్క ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.రూ.500 లకే సిలిండర్ అందిస్తామని చెప్పారు.ఈ క్రమంలో తెలంగాణలో మార్పు రావాలంటే అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ఆయన వచ్చూ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.