తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.దేశంలో అత్యధిక పెట్రోల్ రేట్లు తెలంగాణలోనే ఉన్నాయన్నారు.
ఈ క్రమంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ఆరు నెలల ముందే మద్యం షాపులకు వేలం వేశారని కిషన్ రెడ్డి విమర్శించారు.
మద్యం ఏరులైపారిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని తెలిపారు.బీఆర్ఎస్ పాలనో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలం అవుతుందని ఆరోపించారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో మార్పు రావాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.