ఎల్లుండి నుండి చంద్రబాబు "బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ"..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) మళ్లీ జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు.“బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ”( Babu Surety Future Guarantee ) కార్యక్రమం పేరిట జిల్లాలలో పర్యటించడానికి రెడీ కావడం జరిగింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 5వ తారీఖు నుండి “బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ” అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నారు.సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో అనంతపురం జిల్లాలలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గంతకల్ నియోజకవర్గం పర్యటించబోతున్నారు.

 Chandrababu Babu Surety Future Guarantee From Day After Tomorrow, Chandrababu,-TeluguStop.com

ఆ తర్వాత సెప్టెంబర్ 8, 9 తారీకులలో కర్నూలు జిల్లాలలో పర్యటించనున్నారు.

ఎల్లుండి ఉదయం బళ్లారి వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం “బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమం చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే హామీల విషయానికి సంబంధించి భరోసా ఇచ్చే రీతిలో చంద్రబాబు పర్యటించబోతున్నారు.ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మహానాడు( Mahanadu ) కార్యక్రమంలో మొదటి విడత టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే.

ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ దాని అమలు చేసే బాధ్యత తమది అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube