ఎల్లుండి నుండి చంద్రబాబు “బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ”..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) మళ్లీ జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు.

"బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ"( Babu Surety Future Guarantee ) కార్యక్రమం పేరిట జిల్లాలలో పర్యటించడానికి రెడీ కావడం జరిగింది.

ఈ క్రమంలో సెప్టెంబర్ 5వ తారీఖు నుండి "బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ" అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నారు.

సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో అనంతపురం జిల్లాలలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గంతకల్ నియోజకవర్గం పర్యటించబోతున్నారు.

ఆ తర్వాత సెప్టెంబర్ 8, 9 తారీకులలో కర్నూలు జిల్లాలలో పర్యటించనున్నారు.ఎల్లుండి ఉదయం బళ్లారి వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం "బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చే హామీల విషయానికి సంబంధించి భరోసా ఇచ్చే రీతిలో చంద్రబాబు పర్యటించబోతున్నారు.

ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన మహానాడు( Mahanadu ) కార్యక్రమంలో మొదటి విడత టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే.

ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ దాని అమలు చేసే బాధ్యత తమది అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.

వీడెవడండీ బాబు.. రోటిపై ఆవు పేడ వేసుకుని తినేస్తున్నాడు!