సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు అవధులు లేకుండా పోయింది.ఎక్కడ ఏ చిన్ని సంఘటన జరిగినా సరే క్షణాల్లో మనముందుంటుంది.
ఇక కొన్ని వీడియోలు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని వీడియోలు వీటితో ఇలా కూడా పనిచేయవచ్చా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.
కొందు చేసే కొన్ని పనులు ఇదేంటి ఇలా చేస్తున్నారు అనిపించా.అవి నెటిజన్స్ను అట్రాక్ట్ చేస్తాయి.
అలా ఓ అంకుల్ చేసిన పని అందరినీ ఓ పక్క నవ్విస్తూ, మరో పక్కా వాట్ ఏ ఐడియా అనేలా చేస్తుంది.
ఎవరమైనా సరే ఆహారం తినడానికి మన చేతులను ఉపయోగిస్తం.
లేదంటే స్పూన్తో తింటాం.ఇక కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా, చాప్ స్టిక్తో తింటుంటారు.
కానీ ఓ అంకుల్ తన ఫ్యామిలీనో లేదా ఫ్రెండ్స్తోనో తెలియదు తినడానికి రెడీగా డైనింగ్ టేబులుపై కూర్చున్నాడు.ఇక అందరూ స్పూన్స్, చాప్ స్టిక్తో తమకు కావాల్సిన ఫుడ్ తీసుకొని తింటున్నారు.
అయితే ఈ అంకుల్ వద్ద తినడానికి చాప్ స్టిక్ లేదు.దీంతో కొద్ది దానికోసం వెతికిన ఆయనకు ఓ ఆలోచన తట్టింది.
తన ముందున్న బొమ్మనే తనకు తినడానికి సహాయం చేసింది.అదేలా అంటే.
ఆ అంకుల్ తన తెలివిని ఉపయోగించి, బార్బీ బొమ్మను చాప్ స్టిక్ గా వాడేశాడు.బొమ్మ కాళ్లు కాస్త పొడవుగా ఉండటంతో.
తనకు కావాల్సిన పదార్థాలు హ్యప్పీగా తినగలిగాడు.ఇక అతను చేసిన ఈ పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.
దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కొందరు అంకుల్ తెలివికి సలాం అంటే మరికొందరు భలే చేస్తున్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.