ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు.ఏవోబీలోని మల్కన్గిరి జిల్లా కటాఫ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు అయిన బీఎస్ఎఫ్ బెటాలియన్ గొప్ప విజయాన్ని సాధించింది.
బీఎస్ ఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, ఆంద్రాకు సరిహద్దుల్లో ఉన్న ఖొరిగండి అటవీప్రాంతంలో పెద్ద గొయ్యిని తవ్వి పెద్ద ఎత్తున నిల్వ చేసిన మావోయిస్టులు సామాగ్రీను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో అతి పెద్ద అయిదు మందుపాతరలను మరియు మావోయిస్టు సామాగ్రీ ఉన్నాయి.
మావోయిస్టులకు సంబందించిన మరికొంత సమాచారం కోసం బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు.