BJP MP Laxman : అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోరు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలు అభివృద్ధి, అబద్ధాలకు మధ్య జరిగే పోరని తెలిపారు.

 Battle Between Development And Lies Mp Laxman-TeluguStop.com

తెలంగాణలో పదికి తగ్గకుండా ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) రాజకీయ భవిష్యత్ లేదని చెప్పారు.

అటు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దాట వేస్తోందని మండిపడ్డారు.

ఓఆర్ఆర్, కాళేశ్వరం మరియు ధరణి పోర్టల్ లో అవినీతి కనిపించినా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నోరు మెదపడం లేదని తెలిపారు.బీజేపీని నిలువరించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు.దక్షిణ భారత్ ను విభజించాలని కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారని తెలిపారు.

ఇండియా కూటమి( India Alliance ) చీలికలతో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు.ఇండియా కూటమికి అజెండా, నీతి లేదని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube