మంత్రాలయంలో దారుణం.. కన్న కొడుకులను చంపేసిన కసాయి తల్లి..!

ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం లోని కౌతాళం మండలం హల్వి గ్రామంలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

 Atrocity In Mantralayam Butcher's Mother Who Killed Her Younger Sons , Si Narend-TeluguStop.com

ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి( SI Narendra Kumar Reddy ) తెలిపిన వివరాల ప్రకారం.హల్వి గ్రామంలో రామకృష్ణ, శారద ( Ramakrishna, Sarada )దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరికి 3ఏళ్ల వెంకటేష్, ఆరు నెలల భరత్ అనే కుమారులు సంతానం.శనివారం మధ్యాహ్నం శారద తన ఇద్దరు కుమారులను నీటి బకెట్లో ముంచడం వల్ల ఆ పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

దీంతో వెంటనే భర్త రామకృష్ణతో కలిసి ఆ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లింది.అప్పటికే ఆ పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి, పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఇద్దరు చిన్నారులను తాను చంపినట్లు తెలిస్తే.కుటుంబ సభ్యులు తనను కూడా చంపేస్తారేమో అనే భయంతో శారద విషం తాగింది.ఇంట్లో వాళ్ళు శారదను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి కు సమాచారం అందడంతో ఆసుపత్రికి వెళ్లి అన్నీ వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

శారద తన పిల్లలను కావాలనే చంపేసిందా.లేదంటే పొరపాటున జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.ఒకవేళ కావాలని చంపితే అందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు కలుపుకున్నాయి.నవ మాసాలు మోసిన కన్నతల్లి తన చేతులతో తానే కన్న బిడ్డలను చంపుకోవడం చాలా బాధాకరం.ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube