ఏపీ సీఎం జగన్ మరికాసేపటిలో ఢిల్లీకి వెళ్లనున్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన హస్తినకు బయలుదేరనున్నారు.
రేపు విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాదంపై జరిగే సమీక్ష సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది.
ఈ భేటీలో భాగంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, టీడీపీ -జనసేన పొత్తుపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.