1.తెలంగాణ ఉద్యమకారుల భేటీ
మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం భేటీ అయ్యారు.
2.ఆన్లైన్ విద్యా విధానం అమలు పై రేపు ప్రకటన
ఆన్లైన్ విద్యావిధానం అమలుకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు కీలక ప్రకటన చేయనున్నారు.
3.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు అనారోగ్యం
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అనారోగ్యానికి గురయ్యారు గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
4.పెద్ద పులి సంచారం
కొమరం భీం జిల్లా లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.కాగజ్ నగర్ మండలంలోని చారిగాం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.
5.6 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, బిఎడ్ ప్రవేశ పరీక్షలు, ఎంబీఏ పరీక్షలు జూలై 6 నుంచి ఆగస్టు 1 వరకు జరగనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
6.14 పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవలు
తెలంగాణలో 14 పోస్ట్ ఆఫీస్ లో పాస్పోర్ట్ సేవలను పునరుద్ధరించిన హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు.
7.బీసీ గురుకుల కాలేజీ లో దరఖాస్తు గడువు పెంపు
మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ బాలికలకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష గడువు జులై 5 వరకు పెంచింది.
8.ఆదిలాబాద్ లో వన్ మిలియన్ మొక్కలు
జులై 4వ తేదీన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజే పది లక్షలు మొక్కలు నాటి సరికొత్త రికార్డును సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
9.పంట పొలాలపై ఏనుగుల దాడి
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ముసలిమడుగు గ్రామంలో పంట పొలాలపై దాడులు చేస్తుండడంతో సమీప ప్రాంతాల రైతులు తీవ్ర భయాందోళన లో ఉన్నారు.
10.చిన్న తిరుపతి లో కరోనా ఆంక్షలు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నేటి నుంచి కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి ఈరోజు నుంచి వచ్చే నెల 3 వరకు కరోనా ఆంక్షలు కొనసాగనున్నాయి.
11.1న ఏవోబీ బందుకు మావోయిస్టుల పిలుపు
తీగల మట్ట ఎన్ కౌంటర్ కు నిరసనగా జులై ఒకటో తేదీన ఏ బి బంద్కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఆంధ్రా ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ప్రకటించారు.
12.టీటీడీకి కోటి విరాళం
కర్ణాటక కేపీపీసీ ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన నారా సూర్యనారాయణ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.
13.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శనివారం తిరుమల శ్రీవారిని 18,527 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
14.ఏపీకి టీకాలు
ఏపీకి కొత్తగా 4.09 లక్షల కోవిడ్ డోసులు వచ్చి చేరాయి.పూణె లోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు డోసులు చేరుకున్నాయి.
15.జూలై 25 న సైనికుల ఎంపిక పరీక్ష
సైనికుల ఎంపికకు జూలై 29 పరీక్ష నిర్వహించనున్నట్లు సైనికులు ఎంపిక ప్రధాన కార్యాలయం తెలిపింది.
16.నేడు పుదుచ్చేరి మంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మంత్రివర్గం ఆదివారం కొలువు తీరనుంది.
17.’ మా ‘ అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ మంచు విష్ణు జీవిత రాజశేఖర్ హేమ ప్రకటించగా తాజాగా మరో నటుడు నరసింహారావు తానూ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.
18.ఎం ఐ ఎం తో పొత్తు లేదు
ఎంఐఎం ఎట్టిపరిస్థితుల్లో పొత్తు ఉండబోదని బిఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు.
19.డెల్టా ప్లస్ తో భయం లేదు
డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత హానికరం కాదు అని స్థానిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ ఫరిడ తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,170
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,160
.