కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి మనోళ్ళలో క్రియేటివిటీ బాగా పెరిగిపోయింది.ఆ క్రియేటివిటీ పుణ్యం వలనే టీవీలో వేసిన సినిమాలు, సాగదీసే సీరియల్ చూసే బాధ తప్పింది.
ఇక మొన్న నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు పిల్లలు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఫైట్ సీన్ అచ్చు దించి అందరినీ ఆశ్చర్యపరిచారు.వారి టాలెంట్ కు ఇంప్రెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి వారిని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
ఇక తాజాగా ఇలాంటి ఫీటే కొందరు పిల్లలు కూడా చేశారు.ఆ ఫీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ, పూజా హెగ్డే జంటగా నటించిన ” అలా వైకుంఠపురంలో ” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆ చిత్రంలోని చున్నీ ఫైట్ ను తాజాగా కొందరు పిల్లలు అచ్చు దించారు.
వారి టాలెంట్ ను చూసినా వారంతా నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.ఈ కుర్రాళ్ళ క్రియేటివిటీకి బాగా ఇంప్రెస్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.