సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ అసమర్థతతోనే పేపర్ లీకేజీ కావడం జరిగిందని,నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎబివిపి నాయకులు అన్నారు.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేపర్ లీకేజీ పై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని,లీకేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న ఎబివిపి కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పోలీస్ స్టేషన్లో కూడా నిరసన వ్యక్తం చేశారు.