అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సేవలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆక్సియం స్పేస్కు( Infrastructure company Axiom Space ) సీఈవోగా భారత సంతతికి చెందిన తేజ్పాల్ భాటియా( Tejpal Bhatia ) నియమితులయ్యారు.ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటి వరకు ఈ స్థానంలో డాక్టర్ కామ్ గఫారియన్ వ్యవహరించారు.ఈయన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, కో ఫౌండర్ బాధ్యతలు నిర్వర్తించారు.
తాజా మార్పుల నేపథ్యంలో గఫారియన్ సీఈవో( Ghaffarian CEO ) బాధ్యతల నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు.
ఎవరీ తేజ్పాల్ భాటియా ?గడిచిన నాలుగేళ్లు తేజ్పాల్ భాటియా.ఆక్సియమ్ స్పేస్లో చీప్ రెవెన్యూ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతకు ముందు ఆయన సెర్చింజిన్ దిగ్గజం గూగుల్లో పనిచేశారు.ఓ స్టార్టప్ను స్థాపించడంతో పాటు ఈఎస్పీఎన్లో ఎగ్జిక్యూటివ్గా, గూగుల్ క్లౌడ్లో స్ట్రాటజీ లీడర్గానూ తేజ్పాల్ వ్యవహరించారు.2021లో ఆక్సియమ్లో చేరినప్పటి నుంచి 1 బిలియన్ డాలర్లకు పైగా కాంట్రాక్టులను తమ సంస్థకు తీసుకొచ్చారని ఆక్సియమ్ తెలిపింది.నాసా తలపెట్టిన ఆర్టెమిస్ III చంద్రుడి మిషన్ ( Artemis III Moon Mission )కోసం నెక్ట్స్ జనరేషన్ స్పేస్ సూట్లను అభివృద్ధి చేయడానికి పలు సంస్థలతో సమన్వయం చేశారు భాటియా.అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన చేరిక ఆక్సియమ్ వృద్ధికి దోహదం చేస్తుందని ఈ సంస్ధ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కామ్ గఫారియన్ ఆకాంక్షించారు.

కాగా.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో నాసాతో కలిసి ఇస్రో సంయుక్తంగా ఆక్సియమ్ 4 మిషన్ చేపట్టింది.దీనిలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామిని పంపించనున్నారు.ఈ మిషన్కు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసింది.ఈ మిషన్లో ఆక్సియమ్ సంస్థ కీలకపాత్ర పోషిస్తోంది.
త్వరలో ఐఎస్ఎస్కు వ్యోమగాములు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కంపెనీకి భారత సంతతికి చెందిన తేజ్పాల్ భాటియా సీఈవోగా నియమితులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.