ప్రస్తుతం లింగా సినిమా మిగిల్చిన పీడ కలని మరచిపోయి ప్రశాంతంగా సినిమాలు చేస్తున్న రజినీకాంత్ రోబో సీక్వెల్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.రోబో 2 .0 షూటింగ్ డిల్లీ లో భారీ సెట్ లో నడుస్తోంది.అక్షయ్ కుమార్ – రజినీకాంత్ ల మీద డైరెక్టర్ శంకర్ కీలక సన్నివేశాలు తెరకి ఎక్కిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ దీంట్లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఆడియో వేడుక కోసం ఇప్పటికే ప్రొడ్యూసర్ లు లైకా ప్రొడక్షన్స్ వారు భారిగా ప్లాన్ చేస్తున్నారు.350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకి ఎక్కిస్తూ ఉండగా అంతే రేంజ్ లో ఆడియో ఉండాలి అని ప్లాన్ చేస్తున్నారు.దానికోసం లండన్ లో ఇప్పుడు ఏర్పాట్లు మొదలయ్యాయి అంటున్నారు.
ఒక భారతీయ సినిమాకి అందునా సౌత్ ఇండియన్ సినిమాకి వేరే దేశం లో అదీ లండన్ లో ఆడియో లాంచ్ అంటే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.