నిర్మాతపై కేసు వేసిన పవన్ కళ్యాణ్ ?

ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలియదు కాని, ఈ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ నుంచి వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతపై కేసు వేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

 Pawan Kalyan Filed Case On Bvsn Prasad ?-TeluguStop.com

ఆ నిర్మాత ఎవరో కాదు , శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర అధినేత, నాన్నకు ప్రేమతో నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్.పవన్ కళ్యాన్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రాన్ని నిర్మించింది ఆయనే.ఇంతకీ పవర్ స్టార్ కేసు ఎందుకు వేస్తున్నట్లు ?

అత్తారింటికి దారేదికి సంభందించి పవన్ కళ్యాణ్ కి ఇంకా రెండు కోట్ల పారితోషికం ఈ నిర్మాత చెల్లించాల్సి ఉందట.బ్యాలెన్స్ గా ఉన్న ఆ రెండు కోట్లు సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అయినా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ చెల్లించకపోవడం, పవన్ కళ్యాణ్ అడిగినప్పుడల్లా ఎదో ఒకటి చెప్పి మాట దాటివేయడం, నాన్నకు ప్రేమతో రిలీజ్ కి ముందు డబ్బు చెల్లిస్తానని చెప్పి మాట తప్పడంతో పవన్ కి కోపం వచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే హైదరాబద్ ఫిలింనగర్ లో ఉన్న “మా” ( మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) లో బివిఎస్ఎన్ ప్రసాద్ పై పవన్ కళ్యాన్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ ఫిర్యాదుని “మా” తెలుగు నిర్మాతల మండలి కి పంపినట్లు చెబుతున్నారు ఫిలింనగర్ జనాలు.

బివిఎస్ఎన్ ప్రసాద్ గాని, స్వయంగా పవన్ కళ్యాణ్ గాని స్పందిస్తే తప్ప అసలు విషయం బయటపడదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube