‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత మహేష్బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలు ప్రారంభించుకుంది.
వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నట్లుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రకటించాడు.అదే సమయంలో ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేసినట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే తాజా పరిణామాలు గమనిస్తుంటే ఈ సినిమా నుండి రకుల్ ప్రీత్ సింగ్ తప్పుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చాలా బిజీగా ఉంది.
రామ్చరణ్తో ఒక సినిమాలో నటిస్తూనే ఎన్టీఆర్ సినిమాకు ఓకే చెప్పి, మహేష్బాబు సినిమాకు కూడా సైన్ చేసింది.అయితే రామ్ చరణ్ సినిమా పూర్తి కావస్తున్నప్పటికి ఎన్టీఆర్ సినిమా ఇంకా ప్రారంభం అయ్యింది లేదు.
దాంతో మహేష్బాబు సినిమాకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.ఎన్టీఆర్, సుకుమార్ల సినిమాతో పాటు, బ్రహ్మోత్సవం సినిమా కూడా ఒకే సారి చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
దాంతో ఈమెకు రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ లేదు.చేసేది లేక రకుల్ తప్పని పరిస్థితుల్లో మహేష్బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా వదులుకున్నట్లుగా తెలుస్తోంది.