సీమాంధ్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు.గతంలో ఏం మాట్లాడినా ఆచి.
తూచి మాట్లాడిన బాబు, ఇప్పుడు తన మాటల స్టైల్ ను మార్చి విమర్శల పాలవుతున్నారు.విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జనాభా నియంత్రణ అక్కర్లేదు.
ఒకరిద్దరిని ఎక్కువ కన్నా నష్టం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.ఇక మరో పక్క అదే క్రమంలో చాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో చంద్రబాబు వెంకన్న భక్తులను హర్ట్ చేసేలా మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ను తలచుకుంటే, వెంకటేశ్వర స్వామిని తలచుకున్నట్టేనని, ఎన్టీఆర్ పేరుకు అంత బలముందని, లో చంద్రబాబు ఈ కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ ను తలచుకుని ఏపని చేసినా, ఆ పని తప్పకుండా నెరవేరుతుందని, ఎన్టీఆర్ కు అంత పవర్ ఉందని చంద్రబాబు తెలిపారట.
పార్టీ పరంగా, వ్యక్తిత్వం పరంగా ఎన్టీఆర్ ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఆయన్ని సాక్షాత్తూ వెంకన్నతో పొగడటం కొంచెం ప్రజలను ఇబ్బంది పెట్టే అంశమే.