తెలంగాణా ముఖ్యమంత్రి పేరు చెబితేనే రెచ్చిపోయే నేతల్లో ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఒకరు .ఈ మధ్యనే నీ కొడుక్కి ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నావ్ అని ఓ రేంజ్ లో ఏకిపారేసాడు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను పల్లెత్తు మాట అనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న ఈ టైం లో రేవంత్ మరొకసారి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు .ఈ సారి విద్యార్థుల సమస్య ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ను కడిగి పారేసాడు రేవంత్ రెడ్డి.విద్యార్ధుల కౌన్సిలింగ్ జరగకుండా ఉండడానికి కేసీఆర్ కారణమని ,విద్యార్థుల అడ్మిషన్ లకు 1956 స్థానికత పెట్టడం ఏంటని రేవంత్ ప్రశ్నించాడు
స్థానికతకు 1956 ప్రమాణమని కేసీఆర్ చెబుతున్నారని… అలాగే తాము కూడా ఇక్కడి సీఎం ఇక్కడే పుట్టి ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.అసలు కేసీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పుట్ట లేదని ఆయన బీహార్ లో పుట్టాడని కొత్త పాయింట్ లేవనెత్తాడు రేవంత్ .‘విద్యారంగం-ప్రభుత్వ వైఖరి‘పై టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో చర్చా గోష్టి లో పాల్గొన్న రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసాడు
బీహార్లో పుట్టి విజయనగరం వలస వచ్చిన కెసిఆర్.ఏ స్థానికత ప్రకారం తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ప్రశ్నించారు.
ఇంటికో ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.ఉద్యమ సమయంలో విద్యార్ధుల మద్దతు కోరిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కేసీఆర్ కు దమ్ముంటే.సెక్యూరిటీ లేకుండా ఓ యూ విద్యార్థులతో అరగంట సేపు గడపాలని సవాల్ విసిరారు.
కేసీ ఆర్ తనకు తాను తెలంగాణా గాంధీ గా భావిస్తున్నాడని కాని ప్రొఫెసర్ జయశంకరే నిజమైన తెలంగాణ గాంధీ అని రేవంత్ అన్నారు.ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.