సికింద్రాబాద్ పార్లమెంట్( Secunderabad Parliament ) నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది.ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్,( MLA Gopinath ) శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) సమక్షంలోనే నేతలు పరస్పరం తోసుకున్నారని తెలుస్తోంది.
దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు పార్టీ నేతల తీరుపై కేటీఆర్ తీవ్ర అసహానం వ్యక్తం చేశారని సమాచారం.అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను( MLA Padmarao Goud ) పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.