జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ లో ( BRS ) గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని వదిలి పెట్టబోమన్నారు.
ఒకవేళ పార్టీ మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని తెలిపారు.పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతారని పేర్కొన్నారు.
స్వలాభం చూసుకుని పార్టీలు మారడం దారుణమన్నారు.
కాంగ్రెస్,( Congress ) బీజేపీలకు( BJP ) ఎంపీ అభ్యర్థులే లేరన్న ఆయన తమ పార్టీ నేతలను చేర్చుకొని టికెట్స్ ఇస్తున్నారని విమర్శించారు.
అక్రమాలు చేసిన నేతలు భయంతో పార్టీ మారుతున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాంటి వారి అవినీతిని తామే బయటపెడతామని హెచ్చరించారు.