కొల్లాపూర్ లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని అమిత్ షా ఆరోపించారు.కాంగ్రెస్ ను గెలిపిస్తే వారంతా బీఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు.
యువతపై కేసీఆర్ కు ప్రేమ లేదన్న అమిత్ షా కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని వెల్లడించారు.