మీరు విన్నది నిజమే.రాజస్థాన్కు చెందిన ఓ కుర్రాడు తనవద్ద పోగుచేసుకున్న భారీ మొత్తం నాణేలతో ఐఫోన్ను సొంతం చేసుకోవాలని యాపిల్ స్టోర్కు వెళ్లాడు.ఆ నాణేల విలువ అక్షరాలా రూ1.5 లక్షల కంటే ఎక్కువ.కాగా అంత పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు చూసిన సదరు దుకాణ దారుడు అవాక్కయ్యాడు.దాంతో చిల్లర తీసుకునేందుకు నిరాకరించటంతో ఆ షాపువాడితో యువకుడు వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలోనే స్టోర్ లోపల నాణేలు చెల్లా చెదురుగా పడిపోయాయి.కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే ఆ వీడియోకు ఇప్పటివరకు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.అయితే ఆ అబ్బాయి అదంతా కావాలనే చేసినట్టు సదరు వీడియో చూస్తేనే అర్ధం అయిపోతుంది.
ఎందుకంటే అతగాడు ఓ ఫేమస్ యూట్యూబర్.అతని పేరు తెలియని నార్త్ జనాలు ఉండరంటే నమ్మశక్యం కాదు.
అతని ఛానల్ కి 24 మిలియన్ ఫాలోయర్స్ ఉండటం కొసమెరుపు.అతని పేరు అమిత్ శర్మ.
అతను ఓ యూట్యూబర్ అని తెలియని సదరు షాప్ ఓనర్ మాత్రం అతనిపై చాలా ఫైర్ అవ్వడం ఈ వీడియోలో గమనించవచ్చు.
ఈ క్రమంలో నాణేలను లెక్కించడంపై ఇరువురి మధ్య వాగ్వాదం కూడా జరిగింది.దీంతో ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది.అయితే ఈ క్రమంలో ఆన్ లైన్ లో చెల్లించి అమిత్ మొబైల్ తీసుకున్నాడు.
అమిత్ కి వున్న ఆ ఛానల్ పేరు Crazy XYZ.కాగా ఈ ఛానెల్లో అతను నాణేలతో ఐఫోన్ను కొనుగోలు చేస్తున్న సో కాల్డ్ వీడియోను అప్లోడ్ చేయగా రెండు రోజుల్లోనే ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.వీడియో ప్రారంభంలో, అమిత్ తన స్నేహితులతో చాలా నాణేలు పట్టుకుని కనిపించడం గమనించవచ్చు.వివాదం అనంతరం.దుకాణదారుడితో అమిత్ సరదాగా మాట్లాడాడు.