కర్నూలు పీఎస్‎కు చేరిన చిన్నారుల తారుమారు పంచాయితీ

సంచలనంగా మారిన చిన్నారుల తారుమారు పంచాయితీ చివరకు కర్నూలు పోలీస్ స్టేషన్ కు చేరింది.ఈ నేపథ్యంలో వైద్యులు, బాధితులతో చర్చలు చేస్తున్నారు పోలీసులు.

 Panchayat Manipulation Of Children Who Joined Kurnool Ps-TeluguStop.com

సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే రమేశ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాన్పు కోసం వస్తే డెలివరీ తర్వాత పురిట్లోనే తమ చిన్నారులను డాక్టర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.మొదట బాబు పుట్టాడని మగ పిల్లాడిని ఇచ్చారని, గంట తర్వాత ఆడపిల్ల అంటూ ఆస్పత్రి సిబ్బంది బిడ్డను మార్చేశారని వెల్లడించారు.

మగ బిడ్డైనా, ఆడ బిడ్డైనా తమ బిడ్డే తమకు కావాలని బాధితులు వాపోతున్నారు.ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమేశ్ ఆస్పత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube