మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతూ ఎన్నో ఎత్తుపల్లాలని చూసినవారు అని చెప్పాలి.ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ నేడు ఈ స్థాయిలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు.
అయితే దసరా పండుగ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించినటువంటి అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి పాల్గొనగా అక్కడ గరికపాటి నరసింహారావు చిరంజీవిని అవమానకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి వంటి ఒక గొప్ప హీరో ఒక కార్యక్రమానికి వస్తే పెద్ద ఎత్తున అభిమానులు తనతో కలిసి ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు.
అయితే ఈ కార్యక్రమంలో అభిమానుల సైతం చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించగా గరికపాటి నరసింహారావు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపితే బాగుంటుంది లేదంటే ఈ కార్యక్రమం నుంచి నాకు సెలవు ఇప్పించండి అంటూ చిరంజీవి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఈ విషయంపై ఎంతో మంది మెగా అభిమానులు గరికపాటిని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇకపోతే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి అప్పుడు మౌనం వహించిన తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి తనదైన స్టైల్ లో గరికపాటి పై పంచ్ వేశారు.ఈ క్రమంలోనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా కొందరు మహిళలు చిరంజీవితో ఫోటో దిగడానికి ఆసక్తి కనబరిచారు.ఈ క్రమంలోనే చిరంజీవి ఇక్కడ వారు లేరు కదా అంటూ పరోక్షంగా గరికపాటిని ఉద్దేశిస్తూ సెటైర్లు వేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే మెగా అభిమానులు గరికపాటికీ సరైన పంచ్ పడింది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు చిరంజీవి వంటి గొప్పవారు ఇలా గరికపాటిని పట్టించుకోవడం సబబు కాదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.