తెలంగాణలో భారత జోడో యాత్రలో రాహుల్ కీలక వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది.పాదయాత్రలో భాగంగా రైతులతో సమావేశమైన రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Rahul's Key Comments On Bharat Jodo Yatra In Telangana Rahul Gandhi, Bharat Jodo-TeluguStop.com

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ఈ ధరణి పోర్టు వాళ్ల చాలామంది రైతులు తమ భూములను కోల్పోయారని ఆరోపించారు.

ఇదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ తెలియజేశారు.

తెలంగాణలో రాహుల్ పాదయాత్రకి మహిళలు మరియు యువకులు నుండి భారీ ఎత్తున ఆదరణ లభిస్తూ ఉంది.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో చాలామంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఇదే సమయంలో పాదయాత్రలో రాహుల్ ఇస్తున్న హామీలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.దక్షిణాదిలో ఇప్పటికే ఏపీ మరియు కేరళ పలు రాష్ట్రాలలో రాహుల్ పాదయాత్ర చేయడం జరిగింది.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఈ పాదయాత్ర వచ్చే నెల 7 వరకు సాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube