చండూరు మున్సిపాలిటీలో బీజేపీకి వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వెలిసాయి.మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రూ.3 వేలు పింఛన్ ఇస్తామన్న నేతల తీరును ఎండగడుతూ గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపాలిటీ వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు.రాష్ట్రంలో ఇచ్చే పింఛన్కంటే ఏ రాష్ట్రామైనా ఎక్కువ ఇస్తున్నదా అని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తున్నదని చెప్పే దమ్ముందా అని రాజగోపాల్కు సవాల్ విసిరారు.ఏ రాష్ట్రంలో ఎంత పెన్షన్ అందిస్తున్నారో పోస్టర్లలో వివరించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల కంటే ఎక్కువ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.