వికారాబాద్ జిల్లాలోని నాగారం వాగులో కారు గల్లంతయింది.వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కారులో ప్రయాణికులు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు.కాగా కారు వరదలో కొట్టుకుపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు జెసిబి సాయంతో కారుని బయటకు తీశారు.అయితే జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.