కాంగ్రెస్ ద్రోహి రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి జిల్లా:ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీపై,రాహుల్ గాంధీపై మోడీ సర్కార్ ఈడి దాడులు చేస్తూ వేధింపులకు గురి చేస్తుంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యనించడం సరైనది కాదన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటని,ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

 Congress Traitor Rajagopal Reddy-TeluguStop.com

ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే పార్టీ మారతానని రాజగోపాల్ రెడ్డి అనడంతో కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని,ఈ మూడేళ్లుగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉన్నప్పటికీ ప్రజల తీర్పును గౌరవించి మౌనంగా ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు.పూటకోసారి పార్టీ మారుతానని చెప్పే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరని,కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని, నాయకుడంటే నీతి నియమాలు ఉండాలని,మాట మీద నిలబడాలని హితవు పలికారు.

ప్రజల తీర్పును గౌరవించకుండా స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.సమసమాజం కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టులు తమ జీవితంలో మతతత్వ పార్టీ అయినా బిజెపికి మద్దతు ఇవ్వరని,చౌటుప్పల్ సంస్థాన్ నారాయణపురం మండలాలు,మున్సిపల్,బ్లాక్ కమిటీలను రద్దు చేయడం జరిగిందని,త్రిసభ్య కమిటీ వేసి త్వరలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈనెల 5వ తేదీన చండూరులో నిర్వహించే సభకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube